Tilak Varma: తిలక్‌ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు

13 Oct, 2022 07:25 IST|Sakshi

జైపూర్‌: ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ తొలి విజయం నమోదు చేసింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా పాండిచ్చేరితో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. తిలక్‌వర్మ (41 బంతుల్లో 57; 1 ఫోర్, 4 సిక్స్‌లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ చేశాడు. మికిల్‌ జైస్వాల్‌ (25 బంతుల్లో 44 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా రాణించాడు.

కాగా తొలి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం తన అర్థసెంచరీతో జట్టుకు విజయం అందించేదాకా వదల్లేదు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాండిచ్చేరి 20 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్‌ తరఫున భగత్‌ వర్మ, తిలక్‌ వర్మ, సీవీ మిలింద్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. మరోవైపు ఇండోర్‌లో ఆంధ్ర, హిమాచల్‌ ప్రదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.

చదవండి: భారత సంతతి క్రికెటర్‌పై 14 ఏళ్ల నిషేధం

మరిన్ని వార్తలు