టోక్యో: టోక్యో వేదికగా జరుగుతన్న పారా ఒలింపిక్స్లో భారత్కు పతకం ఖాయమైంది. భారత ప్యాడ్లర్ భవీనా పటేల్ సంచలనం సృష్టించింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్-4 విభాగంలో సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా రికార్డులకెక్కింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 2, రియో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్తో జరిగిన పోరులో ఘన విజయం సాధించి సెమీస్లోకి దూసుకెళ్లింది.
ప్రత్యర్థి రాంకోవిక్ను 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడించింది. కాగా శనివారం జరిగే సెమీ ఫైనల్స్లో ఆమె చైనాకు చెందిన జాంగ్ మియావోతో తలపడుతుంది. కాంస్యం కోసం ప్లే ఆఫ్ లేకపోవడంతో భవీనాకు పతకం ఖాయమైంది. ఓడిపోయిన సెమీ-ఫైనలిస్టులు ఇద్దరూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంటారు.
చదవండి: IND Vs ENG 3rd Test Day 3: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్(8) ఔట్
⭐1st Indian to secure a #ParaTableTennis medal
⭐Lost her opening match and then won 3 in a row.
⭐In her quarter final match, she trailed just once.Take a bow, @BhavinaPatel6 🔥
Stay tuned for her semi-final tomorrow! ⌛#Paralympics #Tokyo2020 pic.twitter.com/1gyRX7cHOj
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 27, 2021