అండర్‌–19 ప్రపంచకప్‌ సమరానికి సై

14 Jan, 2022 01:01 IST|Sakshi

జార్జ్‌టౌన్‌: భవిష్యత్‌ క్రికెట్‌ స్టార్ల ప్రపంచ కప్‌ నేటినుంచి మొదలవుతుంది. వెస్టిండీస్‌ ఆతిథ్యమిచ్చే ఈ అండర్‌–19 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో కరీబియన్‌ జట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది.  రేపు గ్రూప్‌–బిలో తమ తొలి పోరులో యశ్‌ ధుల్‌ సారథ్యంలోని భారత అండర్‌–19 జట్టు దక్షిణాఫ్రికాతో సమరానికి సిద్ధమైంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపుల్లో తలపడతాయి. ట్రినిడాడ్, అంటి0గ్వా, సెయింట్‌ కిట్స్, గయానా నగరాల్లోని మొత్తం 9 వేదికల్లో 23 రోజుల పాటు ఈ యువ మెగా టోర్నీ జరుగనుంది. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో సెమీఫైనల్స్, 5న జరిగే ఫైనల్స్‌తో ఈ ప్రపంచకప్‌ ముగుస్తుంది.  

గ్రూప్‌–ఎ: బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లండ్, యూఏఈ

గ్రూప్‌–బి: భారత్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండ

గ్రూప్‌–సి: జింబాబ్వే, అఫ్గానిస్తాన్, పపువా న్యూగినియా, పాకిస్తాన్‌

 గ్రూప్‌–డి: స్కాట్లాండ్, శ్రీలంక, విండీస్, ఆస్ట్రేలియా.   
 

మరిన్ని వార్తలు