Syed Mushtaq Ali Trophy 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి..

21 Oct, 2022 09:02 IST|Sakshi

జైపూర్‌: దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’లో హైదరాబాద్‌కు మూడో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

ఠాకూర్‌ తిలక్‌ వర్మ (37 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరో సారి జట్టు టాప్‌ స్కోరర్‌గా నిలవగా, భవేశ్‌ సేఠ్‌ (27), రవితేజ (18) రెండంకెల స్కోరు చేశారు. కరణ్‌ శర్మ 3, కార్తీక్‌ త్యాగి 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం యూపీ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆర్యన్‌ జుయాల్‌ (58 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో చెలరేగగా, కరణ్‌ శర్మ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించాడు.
చదవండిT20 World Cup 2022: నమీబియాపై యూఏఈ విజయం.. నెదర్లాండ్స్‌ సెలబ్రేషన్స్‌ అదుర్స్‌

>
మరిన్ని వార్తలు