ప్రపంచకప్‌ ఫైనల్స్‌ టోర్నీకి ఆంధ్రప్రదేశ్‌ ఆణిముత్యం అర్హత

27 Apr, 2023 10:30 IST|Sakshi

ఆర్చరీ సీజన్‌ ముగింపు టోర్నీ ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెక్సికోలో జరుగుతుంది.

తుర్కియేలో గతవారం జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది.

ఈ ప్రదర్శనతో సురేఖకు మరో మూడు ప్రపంచకప్‌లు మిగిలి ఉండగానే ఫైనల్స్‌కు బెర్త్‌ దక్కింది. ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నీ కొలంబియాలో జూన్‌ 13 నుంచి 18 వరకు జరుగుతుంది.    

మరిన్ని వార్తలు