జ్యోతి సురేఖ పునరాగమనం

29 May, 2022 05:15 IST|Sakshi

తొలి రెండు ప్రపంచకప్‌ టోర్నీల్లో పాల్గొన్న భారత మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ జట్టులో చోటు సంపాదించలేకపోయిన ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ ప్లేయర్‌ వెన్నం జ్యోతి సురేఖ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో సత్తా చాటుకొని మళ్లీ భారత జట్టులోకి వచ్చింది. సోనెపట్‌లో  భారత ఆర్చరీ సంఘం నిర్వహించిన జ్యోతి సురేఖ రాణించి జూన్‌ 21 నుంచి 26 వరకు పారిస్‌లో జరిగే ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీకి, జూలై 7 నుంచి 17 వరకు అమెరికాలో జరిగే వరల్డ్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టులో స్థానం దక్కించుకుంది.

మరిన్ని వార్తలు