గౌహతి వేదికగా శ్రీలంకతో మొదటి వన్డేలో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(113) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(83), శుబ్మాన్ గిల్(70) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
విరాట్ కేవలం 80 బంతుల్లోనే తన 45 అంతర్జాతీయ వన్డే సెంచరీని అందుకున్నాడు. విరాట్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి. ఇక శ్రీలంక బౌలర్లలో కుశాన్ రజితా మూడు వికెట్లు పడగొట్టగా..మధుశంక, కరుణరత్నే, షనక తలా వికెట్ సాధించారు.