హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక తెలుగు సినిమా డైలాగ్ను చెప్పాడు. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాపులర్ డైలాగ్ను తెలుగులో చెప్పి అందరీ దృష్టిని ఆకర్షించాడు. "నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది" అన్న పీకే డైలాగ్ సెహ్వాగ్ నోట వినిపించడం నెట్టింట వైరల్గా మారింది. మొబైల్లో పవన్ డైలాగ్ చెబుతున్న వీడియోను చూస్తూ.. పక్కన అమ్మాయి సాయం చేస్తుండగా సెహ్వాగ్ డైలాగ్ను పలికిన తీరు ఇరువురు సెలబ్రిటీల అభిమానులను ఫిదా చేస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పడిదో అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
Sehwag Naidu mass 🔥🔥🔥 pic.twitter.com/y8fj0674sG
— Chirag Arora (@Chiru2020_) September 6, 2021
చదవండి: మ్యాచ్ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్పై బీసీసీఐ ఆగ్రహం