Vishwanathan Anand: ఆనంద్‌కు తొలి ఓటమి 

5 Jun, 2022 07:38 IST|Sakshi

స్టావెంజర్‌: నార్వే ఓపెన్‌ క్లాసికల్‌ చెస్‌ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌కు తొలి పరాజయం ఎదురైంది. సో వెస్లీ (అమెరికా)తో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌ 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్‌లో ఫలితం తేలడానికి ‘అర్మగెడాన్‌’ గేమ్‌ను నిర్వహిస్తారు. ఈ అర్మగెడాన్‌ గేమ్‌లో సో వెస్లీ 46 ఎత్తుల్లో ఆనంద్‌ను ఓడించాడు.  

మరిన్ని వార్తలు