WI Vs BAN, 3rd T20: పూరన్‌ ధనాధన్‌

9 Jul, 2022 03:31 IST|Sakshi

జార్జిటౌన్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్‌ 2–0తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దయింది. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (39 బంతుల్లో 74 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మూడో టి20 మ్యాచ్‌లో విండీస్‌ 10 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది.

అఫీఫ్‌ హుస్సేన్‌ (38 బంతుల్లో 50; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లిటన్‌ దాస్‌ (41 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం విండీస్‌ 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసి విజయం సాధించింది. కైల్‌ మేయర్స్‌ (38 బంతుల్లో 55; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. మేయర్స్, పూరన్‌ నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరుగుతుంది.

మరిన్ని వార్తలు