Womens Ashes Test: డ్రాగా ముగిసిన మహిళల యాషెస్​ టెస్ట్‌ మ్యాచ్‌

30 Jan, 2022 21:29 IST|Sakshi

England Vs Australia Womens Ashes Test Ends In Draw: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన ఏకైక యాషెస్​ టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆసీస్‌ నిర్ధేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్..​ ఆఖరి రోజు మ్యాచ్‌ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు మాత్రమే చేసి, లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో మ్యాచ్​ డ్రాగా ముగిసింది. 

అంతకుముందు టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. తొలి ఇన్నింగ్స్​ను 337/9 వద్ద డిక్లేర్​ చేసింది. లాన్నింగ్స్​(93),హేన్స్(86),​ తహ్లియా మెక్​గ్రాత్​(52), గార్డ్నర్​(56) అర్ధ శతకాలతో రాణించారు. ఇంగ్లండ్​ బౌలర్లలో బ్రంట్​ 5, సీవర్​ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం హీథర్‌(168*) సెంచరీతో అదరగొట్టడంతో ఇంగ్లండ్​ తొలి ఇన్నింగ్స్​లో 297 పరుగుల​కు ఆలౌటైంది. 

40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 216/7 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్​ చేసి, ప్రత్యర్ధి ముందు 257 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు నతాలీ సీవర్​(58), హీధర్​ నైట్​(48), లారెన్​  హిల్(33), టమ్మీ బ్యూమౌంట్​(36), సోఫియా డంక్లీ(45) రాణించినప్పటికీ.. ఆసీస్​ బౌలర్లు సదర్​ల్యాండ్​(3), అలానా కింగ్(​2) ధాటికి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఫలితంగా ఏకైక యాషెస్‌ టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 
చదవండి: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. స్టార్‌ క్రికెటర్‌ రొమాంటిక్‌ మూమెంట్‌

మరిన్ని వార్తలు