ఆసియా క‌ప్‌లో భారత్‌ శుభారంభం..

22 Jan, 2022 11:14 IST|Sakshi

ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ శుభారంభం చేసింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన పూల్‌ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్‌ 9–0 గోల్స్‌ తేడాతో మలేసియాపై ఘనవిజయం సాధించింది. కెరీర్‌లో 250వ మ్యాచ్‌ ఆడిన వందన కటారియా రెండు గోల్స్‌ సాధించింది. నవనీత్‌ కౌర్, షర్మిలా దేవి కూడా రెండేసి గోల్స్‌ చేయగా... దీప్‌ గ్రేస్‌ ఎక్కా, మోనిక, లాల్‌రెమ్‌సియామి ఒక్కో గోల్‌ సాధించారు.

చ‌ద‌వండి: పాకిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ఇక..!

మరిన్ని వార్తలు