Women’s IPL 2022 TB Vs SW: తొలి మ్యాచ్‌లో తలపడనున్న  ట్రైల్‌బ్లేజర్స్‌,సూపర్‌నోవాస్‌..

23 May, 2022 15:39 IST|Sakshi
PC: IPL. COM

మహిళల టీ20 ఛాలెంజ్ 2022 సోమవారం(మే23) మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ట్రైల్‌బ్లేజర్స్,సూపర్‌నోవాస్ జట్లు తలపడనున్నాయి. ట్రైల్‌బ్లేజర్స్‌కు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుండగా, సూపర్‌నోవాస్‌కు వెటరన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. అయితే ఇరు జట్లలో కూడా చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ పూణేలో ఎంసీఎ క్రికెట్‌ స్టేడియం వేదికగానే జరగనున్నాయి. ఇక ఫైనల్‌ మే 28న జరగనుంది. 
తుది జట్లు (అంచనా)
ట్రైల్‌బ్లేజర్స్‌
స్మృతి మంధాన (కెప్టెన్‌), హేలీ మాథ్యూస్, జెమిమా రోడ్రిగ్స్, షర్మిన్ అక్తర్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), సోఫియా డంక్లీ, పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి గైక్వాడ్‌, సల్మా ఖాతున్

సూపర్‌నోవాస్‌
డియాండ్రా డోటిన్, ప్రియా పునియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), సునే లూస్, హర్లీన్ డియోల్, తానియా భాటియా (వికెట్‌ కీపర్‌), పూజా వస్త్రాకర్, సోఫీ ఎక్లెస్టోన్, అలనా కింగ్, మాన్సీ జోషి, మేఘనా సింగ్

చదవండి: 1000 Sixes In IPL 2022: చరిత్ర సృష్టించిన ఐపీఎల్‌ 2022.. తొలిసారి సిక్సర్ల థౌజండ్‌వాలా పేలింది

మరిన్ని వార్తలు