World Athletics Championships 2022: నేడు బరిలో నీరజ్‌ చోప్రా

22 Jul, 2022 02:23 IST|Sakshi

భారత క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరుకు రంగం సిద్ధమైంది. భారత స్టార్‌ అథ్లెట్, టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా నేడు బరిలోకి దిగబోతున్నాడు.

జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో అతనితో పాటు మరో భారత త్రోయర్‌ రోహిత్‌ యాదవ్‌ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఆటోమెటిక్‌ క్వాలిఫయింగ్‌ మార్క్‌ 83.50 మీటర్లు (లేదా) కనీసం టాప్‌–12లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత లభిస్తుంది.    

ఉ.గం. 5.35 నుంచి సోనీ చానల్స్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

మరిన్ని వార్తలు