World Boxing Championship: భారత బాక్సర్లకు మరో నాలుగు పతకాలు ఖాయం 

24 Nov, 2022 15:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పతకాలపైనే పంచ్‌ విసురుతున్నారు. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌ లో నలుగురు మహిళా బాక్సర్లు ముస్కాన్‌ (75 కేజీలు), తమన్నా (50 కేజీలు), కీర్తి (ప్లస్‌ 81 కేజీలు), దేవిక (52 కేజీలు) పతకాలు ఖాయం చేసుకున్నారు.

క్వార్టర్‌ ఫైనల్స్‌లో తమన్నా 5–0తో జుని తొనెగవా (జపాన్‌)పై, దేవిక 5–0తో అస్యా (జర్మనీ)పై... అజింబై (మంగోలియా)పై ముస్కా న్, బొటికా (రొమేనియా)పై కీర్తి గెలిచారు.
చదవండి: భువీని తీసేయండి.. అతడిని జట్టులోకి తీసుకురండి! అద్భుతాలు చేస్తాడు

మరిన్ని వార్తలు