వినేశ్‌ ఫొగాట్‌కూ...

29 Aug, 2020 01:31 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ కోవిడ్‌–19 బారిన పడింది. కరోనా పరీక్షలో తాను ‘పాజిటివ్‌’గా తేలినట్లు ఆమె స్వయంగా ప్రకటించింది. ఇటీవలే ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన వినేశ్‌... ఇప్పుడు వర్చువల్‌ పద్ధతిలో జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవానికి దూరం కానుంది. అవార్డుల కోసం జరుగుతున్న రిహార్సల్స్‌కు ముందే సోనేపట్‌లో ఆమె కరోనా పరీక్షకు హాజరైంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న వినేశ్, త్వరలోనే కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు