Wriddhiman Saha: సాహా ఆరోపణలపై కమిటీ నివేదిక..

12 Apr, 2022 07:52 IST|Sakshi

ఈనెల 23న పరిశీలించనున్న బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌

Wriddhiman Saha Allegations- న్యూఢిల్లీ: భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఇంటర్వ్యూ విషయమై బెదిరింపులకు పాల్పడిన ఉదంతంపై విచారించిన కమిటీ తమ నివేదికను బీసీసీఐకి అందజేసింది. బోర్డు ఉన్నతస్థాయి అధికారుల బృందం ఈ నెల 23న నివేదికను పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశముంది. ప్రముఖ స్పోర్ట్స్‌ జర్నలిస్టు బొరియా మజుందార్‌ ... సాహాను ఇంటర్వ్యూ అడిగాడు.

క్రికెటర్‌ స్పందించకపోవడంతో బెదిరించినట్లుగా వాట్సాప్‌లో సాహాకు ఎస్సెమ్మెస్‌ పంపడం వివాదాస్పదమైంది. ఓ సీనియర్‌ క్రికెటర్, బోర్డు కాంట్రాక్టు ప్లేయర్‌ను ఓ సాధారణ జర్నలిస్టు శాసించడంపై బోర్డు విచారణ చేపట్టింది. ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి అరుణ్‌ ధుమాల్, సభ్యుడు ప్రభ్‌తేజ్‌ భాటియాలతో కూడిన త్రిసభ్య కమిటీ సాహా ఆరోపణలపై విచారించింది. 

చదవండి: IPL 2022: టైటాన్స్‌ జోరుకు రైజర్స్‌ బ్రేక్‌

మరిన్ని వార్తలు