-

Duleep Trophy 2022 Final: యశస్వి జైశ్వాల్‌ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్‌జోన్‌

23 Sep, 2022 13:40 IST|Sakshi

సౌత్‌ జోన్‌, వెస్ట్‌జోన్‌ మధ్య జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ ఆసక్తికరంగా సాగుతుంది. టీమిండియా యువ క్రికెటర్‌.. వెస్ట్‌జోన్‌ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ సూపర్‌ సెంచరీతో మెరిశాడు. 119 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న యశస్వి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం 140 పరుగుల లీడ్‌లో ఉన్న వెస్ట్‌ జోన్‌ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. కాగా శ్రేయాస్‌ అయ్యర్‌.. యశస్వి జైశ్వాల్‌కు సహకరిస్తూ ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడు.

అంతకముందు సౌత్‌జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 7 వికెట్ల నష్టానికి 318 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన సౌత్‌జోన్‌ జట్టు మరో 9 పరుగులు మాత్రమే జత చేసి 327 పరుగులకు ఆలౌట్‌ అయింది.బాబా ఇంద్రజిత్‌ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. మనీశ్‌ పాండే (48), కృష్ణప్ప గౌతమ్‌ (43), రోహిన్‌ కున్నుమ్మల్‌ (31) రాణించారు. వెస్ట్‌జోన్‌ బౌలర్లో ఉనాద్కట్‌ 4 వికెట్లు తీయగా.. సేత్‌ 3, చింతన్‌ గజా రెండు వికెట్లు తీశారు. అంతకు ముందు వెస్ట్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది.  

చదవండి: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా!

సచిన్‌ క్లాస్‌..యువీ మాస్‌; ఇండియా లెజెండ్స్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు