యూకీ బాంబ్రీకి నిరాశ

21 Feb, 2022 05:41 IST|Sakshi

దుబాయ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్‌ యూకీ బాంబ్రీ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సింగిల్స్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌లో యూకీ 3–6, 4–6తో ఒనీల్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. 72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యూకీ ఐదు ఏస్‌లు సంధించి రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా వృథా చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు