మల్‌గ్రేవ్‌ క్రికెట్‌ క్లబ్‌ తరపున బరిలో దిగనున్న యువీ..

28 Jun, 2021 17:30 IST|Sakshi

ముంబై: యువరాజ్‌ సింగ్‌ మళ్లీ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడానికి సిద్దంమవుతున్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన ‘మల్‌గ్రేవ్‌ క్రికెట్‌ క్లబ్‌’ తరుపున యువరాజ్‌ సింగ్‌ ఆడనున్నట్లు తెలుస్తోంది . యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఆసీస్‌ గడ్డపై బ్యాట్లు ఝుళిపించే అవకాశాలున్నాయి. వారితో  ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ నంచి ఫిబ్రవరి మధ్య జరిగే టీ20 టోర్నీలో వీళ్లు పాల్గొనే వీలుంది. ఇప్పటికే 90 శాతం చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని మల్​గ్రేవ్ క్లబ్‌ అధ్యక్షుడు మిలాన్‌ పుల్లెనయెగమ్‌ పేర్కొన్నారు.

ఇప్పటికే శ్రీలంక క్రికెటర్లు దిల్షాన్​, సనత్ జయసూర్య, తరంగాలు మల్​గ్రేవ్ జట్టులో ఆడనున్నారు. ఇంకొంత మంది సమర్థమంతమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు కృషి చేస్తున్నాం. దీంతో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్​తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ క్లబ్‌ అధ్యక్షుడు మిలాన్​ పుల్లెనయేగమ్​ తెలిపారు.
చదవండి: క్రికెట్‌ సెలబ్రిటీస్‌ ఫ్యామిలీ ఫొటోలు


 

మరిన్ని వార్తలు