‘నీతోపాటు ఉన్నందుకు ఎంతో ఆనందించా ధోని’

17 Aug, 2020 09:06 IST|Sakshi

టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ ట్విటర్‌లో స్పందించారు. ధోనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మైదానంలో తనతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను యువీ షేర్‌ చేశారు. ‘నీ గోప్ప కేరీర్‌కు అభినందనలు. 2007 టీ20 ప్రపంచ కప్‌, 2011 వన్డే ప్రపంచ కప్‌ విజయంలో నీతోపాటు భాగస్వామిగా ఉండటం పట్ల ఎంతో ఆనందించాను. రిటైర్మెంట్‌  అనంతరం మంచి భవిష్యత్‌​కు నీకివే నా శుభాకాంక్షలు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు యువీ. ఆయన షేర్‌ చేసిన వీడియోలో ధోనితో కలిసి దిగిన మరపురాని ఫొటోలు ఉన్నాయి. కాగా, మిడిల్‌ ఆర్డర్‌లో విజయవంతంగా రాణించిన యువీ, ధోని జంట టీ-20, వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతూ మహేంద్ర సింగ్‌ ధోని ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (3 కోట్ల వ్యూస్‌కు చేరువలో ధోని వీడ్కోలు పాట)

మరిన్ని వార్తలు