ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

29 Mar, 2023 00:48 IST|Sakshi

ప్రశాంతి నిలయం: ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ (జనరల్‌) పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జిల్లాలోని 99 కేంద్రాల్లో కామర్స్‌, కెమిస్ట్రీ పరీక్షలు నిర్వహించగా, 929 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. చివరి రోజు మొత్తం 31,198 మంది విద్యార్థులకు గాను 30,269 మంది పరీక్షలు రాశారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 28,890 మందికి గాను 28,098 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 2,308 మందికి గాను 2,171 మంది హాజరైన వారిలో ఉన్నారు. ఒకేషనల్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు ఉంటాయని ఆర్‌ఐఓ సురేష్‌బాబు తెలిపారు.

మరిన్ని వార్తలు