కర్మాగారంలో అగ్నిప్రమాదం

30 Mar, 2023 00:44 IST|Sakshi
ఎగిసి పడుతున్న మంటలు

లేపాక్షి: లేపాక్షి సమీపంలో జీన్స్‌ బట్ట తయారు చేసే సార్‌డెనీయం కర్మాగారంలో బుధవారం రాత్రి 9.03 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్పిన్నింగ్‌ మిషన్లు అంటుకోవడంతో కోట్లాది రూపాయాల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మంటలు రేగిన సమయంలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కంపెనీ యాజమాన్యం వారు హిందూపురం, మడకశిర, పెనుకొండ అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇవ్వడంతో, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలు అదుపు చేశారు.

అనుమానాలెన్నో..?

అగ్ని ప్రమాదం విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే విషయం ఇటు కంపెనీ యాజమాన్యం కానీ, అటు కార్మికులు కానీ వెల్లడించలేదు. ఫ్యాక్టరీలో మూడు షిఫ్టులలో కలిపి 300 మంది కార్మికులు పనిచేస్తున్నా.. మంటలు రేగిన సమయంలో ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడం సందేహాస్పదంగా మారింది.

>
మరిన్ని వార్తలు