అనంతపురం సిటీ:.....

30 Mar, 2023 00:44 IST|Sakshi

అనంతపురం సిటీ: ఓటరు జాబితాలో మార్పు, చేర్పులకు సంబంధించిన ప్రక్రియలో నిర్లక్ష్యం వీడాలని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారి కె.భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి ఆయన బుధవారం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు (ఎన్నికల విభాగం), మండల స్థాయి అధికారులు, బూత్‌ లెవల్‌ అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లతో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటరు జాబితాలో పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, ఒక చోట నుంచి మరో ప్రాంతానికి ఓటు బదిలీ, ఆధార్‌తో అనుసంధానం వంటి అంశాలకు సంబంధించి సేకరించిన దరఖాస్తులను చాలా మంది ఇప్పటికీ జిల్లా కార్యాలయాలకు చేర్చలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే దరఖాస్తులను జిల్లా కార్యాలయాలకు చేర్చడంతో పాటు ఏ ఒక్క పనీ పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ జల్లా శ్రీనివాసులు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ అమృత్‌రాజ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు