చెక్‌పోస్టులో కట్టలకొద్దీ నగదు 

18 Oct, 2020 06:16 IST|Sakshi

సాక్షి, హోసూరు: తమిళనాడు సరిహద్దు జూజువాడి చెక్‌పోస్ట్‌లో శుక్రవారం అర్ధరాత్రి క్రిష్ణగిరి ఏసీబీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి లెక్కకు రాని రూ.2 లక్షల 14 వేల 120ను స్వాధీనపరుచుకొన్నారు. హోసూరు– బెంగళూరు జాతీయ రహదారి జూజువాడి వద్ద ఈ చెక్‌పోస్టుపై ఏసీబీ డీఎస్పీ క్రిష్ణరాజ్, ఇన్‌స్పెక్టర్‌ మురుగన్‌లు సోదాలు చేయగా భారీ మొత్తంలో లెక్కలు లేని నగదు బయటపడింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఆర్టీవో అధికారి సుబ్బురత్నంను విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు