పులిని చంపి, కాళ్లు అపహరణ 

28 Aug, 2020 08:48 IST|Sakshi

మైసూరు : నాటు తుపాకీతో పులిని చంపిన దుండగులు దాని నాలుగు కాళ్లను కత్తిరించుకుని వెళ్లారు. ఈ దారుణం మైసూరు జిల్లాలోణి నాగరహొళె అడవుల్లోని కల్లహళ్లి వద్ద జరిగింది. సుమారు ఆరు సంవత్సరాల వయసు ఉన్న పులిని వేటాడి చంపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గస్తీలో ఉన్న అటవీ సిబ్బంది గుర్తించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పులి గోర్ల కోసమే కాళ్లను తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. నల్లబజారులో పులి అవయవాలకు డిమాండ్‌ ఉండడంతో స్మగ్లర్లు పులుల ప్రాణాలు తీస్తున్నారు.   

మరిన్ని వార్తలు