-
తిరువొత్తియూరు: రామాపురంలో గంజాయి విక్రయించిన ముగ్గురు లారీ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. రామాపురం ప్రాంతంలో రాత్రిళ్లు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. రామాపురం ప్రాంతంలో గురువారం రాత్రి అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంలో తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి విచారించారు. వారి వద్ద ఉన్న సంచులను తనిఖీ చేయగా 1.200 కిలోల గంజాయిని గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. వారు రామాపురం పూత్తంబేడు గ్రామానికి చెందిన గౌతం(23), మారిముత్తు (27), సతీష్ (25)గా తేలింది. వారి నుంచి రెండు కిలోల గంజాయిను, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురూ లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది.