బాలికపై కోచ్ లైంగిక దాడి
అన్నానగర్: స్కేటింగ్లో శిక్షణ పొందుతున్న బాలికపై లైంగిక దాడి చేసిన కోచ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ధర్మపురి జిల్లాలోని బాపిరెడ్డిపట్టి వట్టమ్ బయర్నాథం బోదికల్ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు 8, 6వ తరగతులు చదువుతున్నారు. తల్లిదండ్రులు విడిపోవడంతో తాతయ్య ఇంటిలోనే ఉంటూ పాఠశాలకు వెళుతున్నారు. 13 ఏళ్ల బాలికకు గణవాయిపుత్తూరు ప్రాంతానికి చెందిన స్కేటింగ్ కోచ్ సతీష్కుమార్ (27)తో పరిచయం ఏర్పడింది. అక్కాచెల్లెలు స్కేటింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్లారు. ప్రతిరోజూ సతీష్కుమార్ వారిని మోటారు సైకిల్పై ఎక్కించుకుని బొమ్మిడిలోని మైదానానికి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేవాడు. సతీష్కుమార్ 13 ఏళ్ల బాలికతో సన్నిహితంగా మెలిగాడు. ఆమె ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయి పోటీలో విజయం సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. నెలన్నర క్రితం సతీష్కుమార్ పోటీలో పాల్గొనేందుకు చిన్నారిని నాగ్పూర్కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత తనను ప్రేమిస్తున్నానని చెప్పి రైలులో తాళి కట్టాడు. వారు నాగ్పూర్లో హోటల్ గది తీసుకున్నారు. అక్కడ ఆమైపె సతీష్కుమార్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి చైన్నెకి తీసుకువచ్చి హోటల్లో ఉంచి అక్కడా లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక శనివారం హోసూరులో పనిచేస్తున్న తన తండ్రికి చెప్పింది. అతను బొమ్మిడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సతీష్కుమార్ కోసం గాలిస్తున్నారు.
తండ్రి, చెల్లి హత్య
అన్నానగర్: తనను మానసిక ఆశ్రమంలో చేర్చాలని పథకం వేసిన తండ్రి, చెల్లిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సెల్వరాజ్ (65), శాంతి (55) దంపతులు చైన్నె మాంగాడు రాఘవేంద్ర వీధిలో నివాసం ఉంటున్నారు. శాంతి సినిమా రంగంలో సహాయ నటిగా పనిచేస్తోంది. వీరికి రాజేష్, ప్రకాష్ కుమారులు, కుమార్తె ప్రియ వున్నారు. రాజేష్కు వివాహమై తాంబరంలో ఉంటున్నాడు. కూతురు ప్రియ కుటుంబంతో కలిసి మాంగాడు బాలాజీ నగర్లో ఒంటరిగా ఉంటోంది. ప్రకాష్ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఇతను డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. అతను మద్యానికి బానిస కావడంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఏదేదో మాట్లాడుతూ ఇబ్బంది పెడుతుండడంతో గదిలో ఉంచేవారు. శనివారం మధ్యాహ్నం ప్రకాష్ గదిలో నిలబడి గొడవకు దిగాడు. దాచుకున్న కత్తిని తీసుకుని తండ్రి సెల్వరాజ్, చెల్లెలు ప్రియ గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న మాంగాడు పోలీసు లు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాష్ను అరెస్టు చేశారు. తల్లిదండ్రులు తనను కీల్పాక్కం మానసిక ఆశ్రమంలో చేర్చాలని పథకం వేశారని, అందుకే తాను ఆవేశంతో తండ్రి, చెల్లిని గొంతు కోసి హత్య చేశానని పేర్కొన్నాడు.
బైక్ను ఢీకొన్న కారు
● అక్క, తమ్ముడి దుర్మరణం
తిరువొత్తియూరు: మోటార్ సైకిల్ను కారు ఢీకొనడంతో 30 అడుగుల ఎత్తు ఉన్న వంతెనపై నుంచి కింద పడడంతో అక్క, తమ్ముడు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. చైన్నె పల్లావరం సమీపంలోని పమ్మల్ ఎల్ఐసీ కాలనీకి చెందిన షణ్ముఖ సుందరం కుమార్తె కళైసెల్వి (26), కుమారుడు సంతోష్ కుమార్ (21) ప్రైవేటు టెలికాం సంస్థల్లో పనిచేస్తున్నారు. కలైసెల్వికి వివాహమై తాంబరం సమీపంలోని సంతోషపురం రాజాపురం విజ్ఞరాజాపురం 5వ మెయిన్ రోడ్లో ఉంటోంది. శనివారం ఉదయం అక్క, తమ్ముడు సైదాపేటలో ఉంటున్న పెద్దనాన్న కుమరవేలును చూడడానికి వెళ్లారు. మేడవాక్కం, వేళచ్చేరి మెయిన్ రోడ్డులో కొత్తగా కడుతున్న వంతెనపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఢీకొంది. దీంతో బైకు అదుపు తప్పి అడ్డుగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై వెనక కూర్చున్న కలైసెల్వి 30 అడుగుల ఎత్తు వున్న వంతెనపై నుంచి కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. సంతోష్కుమార్ వంతెనపై స్పృహతప్పాడు. అతన్ని క్రోమ్పేట ప్రభుత్వాస్పత్రి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ కుమార్ మృతి చెందాడు. పల్లికరణై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.