తెలంగాణ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు

23 Jul, 2022 15:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతతో నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగు  ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కింద పేర్కొన్న నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు.

ఆయా జిల్లాల్లోని రెవిన్యూ డివిజన్ల పరిధిల్లో కొత్తగా ఏర్పాటైన మండలాలు :

►  నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్, కొత్తపల్లె మండలాలు
► వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ మండలం
► మహబూబ్ నగర్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..కౌకుంట్ల మండలం
► నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో..ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు
► నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం
► మహబూబాబాద్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..సీరోల్ మండలం
► నల్లగొండ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో...గట్టుప్పల్  మండలం
► సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో...నిజాంపేట్‌ మండలం
► కామారెడ్డి జిల్లాలోని, బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. డోంగ్లీ మండలం
► జగిత్యాల జిల్లా/జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిధిలో.. ఎండపల్లి మండలం
► జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిధిలో, భీమారం మండలం
 

చదవండి: తెలంగాణకు అతిభారీ వర్షాల హెచ్చరిక

మరిన్ని వార్తలు