తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా కేసులు

19 Sep, 2020 10:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం 54,459 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,123 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. ఇప్పటి వరకు మొత్తం 24,34,409 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 1,69,169 కేసులు నమోదయ్యాయి. (మంత్రి ఈటల పేషీలో ఏడుగురికి కరోనా)

ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,025కి చేరింది. కరోనా బారి నుంచి శుక్రవారం ఒక్క రోజే 2,151 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,37,508కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,636 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,070 మంది హోం లేదా వివిధ సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు