తెలంగాణలో కొత్తగా 2,261 కరోనా కేసులు

3 Jun, 2021 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,261 కరోనా కేసులు నమోదు కాగా.. 18 మరణాలు చోటుచేసుకున్నాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  5,80,844గా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 3296 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కొత్తగా 2242 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 5,46,536గా ఉంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 94,189 శ్యాంపిళ్లను పరిక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. ఇక కేసుల వారిగా చూస్తే జీహెచ్‌ఎంసీలో 307, నల్గొండలో 170, ఖమ్మంలో 167, రంగారెడ్డి 135, మేడ్చల్‌లో 116 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు