24 గంటల్లో.. 2795 కేసులు, 8 మరణాలు

27 Aug, 2020 09:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉధృతంగానే ఉంది. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2795 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483కి చేరింది.  ఇందులో 86,095మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,600 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 778కి చేరింది.

ఇక కేసుల విషయానికి వస్తే.. జీహెచ్ఎంసి పరిధిలో 449, భద్రాద్రి కొత్త గూడెంలో 72, జగిత్యాలలో 89, కరీంనగర్ లో 136, ఖమ్మంలో 152, మంచిర్యాలలో 106, మహబూబాబాద్ జిల్లాలో 102, నల్గొండలో 164, నిజామాబాద్ లో 112, పెద్దపల్లిలో 77, రంగారెడ్డి జిల్లాలో 268, సిద్ధిపేట జిల్లాలో 113, సూర్యాపేటలో 86, వరంగల్ అర్బన్ లో 132 కేసులు నమోదయ్యాయి.(చదవండి : గుడ్‌ న్యూస్‌ చెప్పిన జపాన్‌ శాస్త్రవేత్తలు)

మరిన్ని వార్తలు