తెలంగాణలో కొత్తగా 2,817 కరోనా కేసులు

3 Sep, 2020 09:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,817 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,33,406కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 856కు చేరింది. బుధవారం ఒక్కరోజే 2611 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,00,013. ( 'వైరస్‌ మారినా వ్యాక్సిన్‌ పనిచేస్తుంది')

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,537. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.09 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 74.9 శాతంగా ఉంది. భారత్‌లో మరణాల రేటు 1.75 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.64 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 59,711 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 15,42,978కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు