మేడారంలో భక్తజన సందడి 

7 Feb, 2022 03:03 IST|Sakshi
సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

సుమారు 3 లక్షల మంది మొక్కుల చెల్లింపు

సాక్షి, ములుగు: ములుగు జిల్లా మేడారం జాతరకు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వాహనాల ద్వారా చేరుకుని.. జంపన్న వాగులో స్నానాలు చేసి.. గద్దెల వద్ద సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముడుపులు కట్టారు. సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. వాహనాలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై రాకపోకలను పునరుద్ధరించారు.
– ఎస్‌ఎస్‌ తాడ్వాయి

మరిన్ని వార్తలు