తెలంగాణలో కొత్తగా 415 కరోనా కేసులు

31 Dec, 2020 09:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,413 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 415 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,86,354కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,541కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

 నిన్న ఒక్క రోజే 316 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,78,839కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,974 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 3,823 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 68,82,694కి చేరింది.


 

మరిన్ని వార్తలు