ఒకేరోజు 6,400 కోళ్లు మృతి

21 Jan, 2021 02:38 IST|Sakshi

సాక్షి, నార్కట్‌పల్లి: కోళ్ల ఫామ్‌లో ఒకేరోజు 6,400 కోళ్లు మృతిచెందాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏనుగులదోరి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రీమియం కంపెనీ సహకారంతో తాను నిర్వహిస్తున్న కోళ్లఫామ్‌లో ఉన్నట్టుండి 6,400 కోళ్లు ఒకేసారి చనిపోయాయని బాధితుడు పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. వెంటనే కంపెనీ యజమానులకు తెలపగా, సిబ్బంది వచ్చి పరిశీలించి.. ఫామ్‌కు సంబంధించిన నీటిట్యాంకులో విషపూరిత రసాయనాలు కలిపిన ఆనవాళ్లు దొరికాయని, ఆ నీటిని తాగి కోళ్లు చనిపోయాయని నిర్ధారించారని చెప్పారు. 

మరిన్ని వార్తలు