రైలు ఢీకొని 82 గొర్రెలు మృతి 

11 Jul, 2022 03:10 IST|Sakshi

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చినమెట్‌పల్లి సమీపంలోని రైల్వేట్రాక్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్సు రైలు ఢీకొని 82 గొర్రె లు మృతి చెందాయి. కాపరి గొర్రెలను పట్టాలు దాటిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సుమారు రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు లక్కం రాజం ఆవేదన వ్యక్తం చేశా డు. లక్కం రాజంను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు