Swimming Pool: కోకాపేటలో విషాదం.. ఫంక్షన్‌కు వచ్చి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయిన బాలుడు

31 Jul, 2022 17:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌ స్విమ్మింగ్‌పూల్‌లో పడి శ్యామ్‌ అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వచ్చిన శ్యామ్‌... స్విమ్మింగ్‌పూల్ వద్ద ఆడుకుంటూ నీటిలో పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడకు చెందిన శ్యామ్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది.
(చదవండి: మహిళా సర్పంచ్‌కు వరకట్న వేధింపులు

మరిన్ని వార్తలు