మోహన్‌బాబుకు లక్ష రూపాయల ఫైన్

19 Feb, 2021 10:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు మోహన్‌బాబుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. మోహన్‌బాబు నిబంధనలకు విరుద్ధంగా తన నివాసానికి హోర్డింగ్‌ పెట్టడమే కాకుండా దానికి లైటింగ్‌ అమర్చినందువల్లే ఫైన్‌ వేసినట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1లోని తన ఇంటి ఆవరణలో సినిమా ప్రకటన బోర్డును మోహన్‌బాబు ఏర్పాటు చేశాడు. అయితే నిర్దేశించిన ప్రమాణాలకు మించి 15 అడుగుల ఎత్తులో ఈ బోర్డును పెట్టారని అధికారులు ఆయనకు పంపించిన నోటీసులో పేర్కొన్నారు. ఈ బోర్డు పెట్టేందుకు కనీసం అనుమతి కూడా తీసుకోలేదని వెల్లడించారు.

కాగా ప్రస్తుతం మోహన్‌బాబు సన్నాఫ్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దేశ రక్షణ కోసం పోరాడే వ్యక్తిగా కనిపించనున్నాడు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్ పతాకం‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: క్షణక్షణం.. ప్రయోగాలు చేయాలంటే ధైర్యం కావాలి

మరిన్ని వార్తలు