వేడి నీళ్లు పడి ఐదేళ్ల చిన్నారి మృతి

10 May, 2021 14:04 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: మండలంలోని బోదపల్లి గ్రామంలో వేడి నీళ్లు మీదపడి ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈన్‌గాం ఎస్సై సందీప్‌ తెలతిదపిన వివరాల ప్రకారం గడిల అశోక్‌- సౌజన్యలకు ముగ్గురు పిల్లలు. గత నెల 29న ప్రమదవశాత్తు అభినయ(5)పై వేడినళ్ల కొప్పెన బోర్లా పడింది. వెంటనే కాగజ్‌నగర్‌లోని అసుపత్రికి తరలించారు. అనంతరం వరంగల్‌ ఎంజీఎం, అక్కడినుంచి హైదరబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మళ్లీ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా చిన్నారిని కాపాడలేకపోయారు.

మరిన్ని వార్తలు