సిరికొండ మండలం: డయేరియా బారిన పడిన 50 మంది

7 Apr, 2021 12:31 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలో డయేరియా ప్రబలతోంది. సిరికొండ మండలం తుమ్మల్ పాడ్ గ్రామంలో డయేరియా ఛాయలు కనడబడుతున్నాయి. చాలా మంది డయేరియా బారిన పడుతున్నారు. ఇప్పటకే 50 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో 20 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి వాంతులు, విరేచనాలవుతున్నాయి. వాంతులు, విరేచనాలతో నీరసంగా మారి గ్రామంలో చాలామంది మంచాన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందించాలని  గ్రామస్తులు కోరుతున్నారు..

మరిన్ని వార్తలు