తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి!

30 Nov, 2022 18:02 IST|Sakshi

సోన్‌: ఇక్కడ దండేనికి వేళాడుతున్న చేపలను చూశారా? ఇవన్నీ ఎండు చేపలు. పచ్చి చేపలను ఎండబెట్టడానికి చేసుకున్న ఏర్పాటు ఇది.

ఆదిలాబాద్ జిల్లా సోన్‌ మండలంలోని గాంధీనగర్‌ గ్రామంలో నివసించేవారంతా గంగపుత్రులే. నాలుగు వందల జనాభా ఉండగా అంతా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిలో చేపల వేట సాగించి జీవనోపాధి పొందుతారు. 

అమ్ముడు పోగా మిగిలిన చేపలను నాలుగు రోజుల పాటు ఎండబెడతారు. ఎండుచేపలను కూడా అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్‌వేర్‌ వదిలి ‘సాగు’లోకి..)

మరిన్ని వార్తలు