ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు పూర్తి

28 Oct, 2022 01:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ తుది దశ సీట్ల కేటాయింపు గురువారం పూర్తయింది. మొత్తం 83 శాతం సీట్లు కేటాయించినట్టు సాంకేతిక విద్యావిభాగం ప్రకటించింది. ఐసెట్‌లో మొత్తం 61, 613మంది అర్హత సాధించారు. 19,666 మంది 3,60,435 ఆప్షన్లు ఇచ్చారు. ఎంబీఏలో 24,278 సీట్లు, ఎంసీఏలో 2865 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎంబీఏలో 21,983 సీట్లు కేటాయించగా, ఇంకా 2295 సీట్లు మిగిలిపోయాయి. ఎంసీఏలో 2865 (వంద శాతం) సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యావిభాగం సూచించింది. 

మరిన్ని వార్తలు