వీధికుక్కల దాడి ఘటన.. కేసు నమోదు, నిందితులుగా ఎవరి పేర్లనూ చేర్చని పోలీసులు!

24 Feb, 2023 16:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై స్థానిక పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మూడు రోజుల పాటు లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న తర్వాతే అంబర్‌పేట పోలీసులు శుక్రవారం కేసు వైపు అడుగేశారు. సీఆర్‌పీసీ 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. అయితే.. కేసులో ఎవరినీ నిందితులుగా చేర్చలేదు.

మరోవైపు ఈ ఉదంతాన్ని మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకున్న కోర్టు.. గురువారం విచారణ సందర్భంగా జీహెచ్‌ఎంసీ తీరుపై ఆగ్రహం వెల్లగక్కింది.  

మరిన్ని వార్తలు