ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజంలో ప్రవేశాలు

2 Aug, 2021 15:20 IST|Sakshi

హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం.. 2021–22 విద్యాసంవత్సరానికి వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సుల వివరాలు
► పీజీ  ప్లొమా ఇన్‌ జర్నలిజం(పీజీడీజే)– కోర్సు కాల వ్యవధి 12 నెలలు.
► డిప్లొమా ఇన్‌ జర్నలిజం(డీజే)–కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు.

► డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం(డీటీవీజే)–కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు.
► సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(సీజే)–కోర్సు కాల వ్యవధి మూడు నెలలు.

► విద్యార్హత: సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం కోర్సుకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగతా కోర్సులకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 

► ప్రవేశ విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కోర్సుల్ని రెగ్యులర్‌ గాను, కరస్పాండెన్స్‌ (దూర విద్య) విధానంలోనూ చేయొచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి నుంచే పాఠ్యాంశాలు లైవ్‌లో వినొచ్చు. తెలుగు లేదా ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో కళాశాల వెబ్‌సైట్‌ (www.apcj.in) ద్వారా పేరు రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 
► దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021
► అడ్మిషన్లు పొందటానికి చివరి తేది: 14.08.2021
► వెబ్‌సైట్‌: www.apcj.in

మరిన్ని వార్తలు