-

తెలంగాణ మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్

18 Nov, 2022 18:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అల్లం నారాయణ వివరంగా ఆంధ్రప్రదేశ్ అకాడమీ చైర్మన్‌కి తెలిపారు.

గత ఎనిమిది సంవత్సరాల నుంచి అకాడమీ నిర్వహించిన శిక్షణ తరగతులు, సెమినార్లు ఇతర కార్యక్రమాలు తెలిపి, మీడియా అకాడమీ ప్రచురణలు, ఇతర వివరాల నోట్ అందజేశారు. ఇద్దరు చైర్మన్లు ఒకరినొకరు శాలువాతో సత్కరించారు. తెలంగాణ అకాడమీ సెక్రటరీ, నాగులాపల్లి వెంకటేశ్వర రావు, ఇరు అకాడమీల సిబ్బంది పాల్గొన్నారు.

చదవండి: ('చంద్రబాబువి పచ్చి అబద్దాలు.. అవి టీడీపీ పుట్టక ముందునుంచే ఉన్నాయి')

మరిన్ని వార్తలు