సాక్షి, కామారెడ్డి: దేశంలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. రోజురోజుకు మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలోని పలు ప్రభుత్వ హాస్టల్స్లో కరోనా వ్యాపించిన సంఘటన ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో కరోనా బారిన పడిన కామారెడ్డిలో ఏఆర్ ఎస్ఐ రాఘవేంద్ర మృతి కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 22న ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన కన్నుముశారు.