Telangana: ఇంటర్‌ అలర్ట్‌

30 Apr, 2022 07:48 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌: వచ్చే నెల 6వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు  పూర్తి చేసింది. కరోనా నిబంధనలు, ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.  

  • పరీక్ష కేంద్రంలో గాలి, వెలుతురు ఉన్న గదులకు మాత్రమే అనుమతిస్తూ సింగిల్‌ బెంచీ (మూడు ఫీట్లు)కి ఒకరు, పెద్ద బెంచీ (ఐదు ఫీట్లు)కి ఇద్దరు విదార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.  
  • విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి. పరీక్ష కేంద్రంలో విద్యుత్,  తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశావర్కర్స్, ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు. డీహైడ్రేషన్‌ నుంచి రక్షించేందుకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను 
  • అందుబాటులో ఉంచతున్నారు.  
  • పరీక్ష కేంద్రంలోని గదికి 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయిస్తున్నారు. ప్రతి గదిలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణ తీరు పర్యవేక్షించనున్నారు.  
  • విద్యార్థులు పరీక్షే కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు మొబైల్‌ యాప్‌ ద్వారా సెంటర్‌ లొకేషన్‌ గుర్తింపు ప్రక్రియకు వెసులుబాటు కల్పించారు. రెండు, మూడు రోజుల్లో మొబైల్‌ యాప్‌ వివరాలను బోర్డు అధికారులు ప్రకటించనున్నారు. 

3.76 లక్షల మంది 

  • గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి సుమారు 3,76,245 మంది పరీక్షకు హజరు కానున్నారు.  
  • ఇందుకోసం సుమారు 517 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  హైదరాబాద్‌ జిల్లాలో ఫస్టియర్, సెకండియర్లో కలిపి 153,119 మంది, రంగారెడ్డి జిల్లాలో 115,366 మంది, మేడ్చల్‌ జిల్లాలో 1,07,760 మంది పరీక్షలకు హజరు కానున్నారు. 
  • ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున నియమిస్తున్నారు. సెంటర్‌ ఒకరు చొప్పున డిపార్ట్‌మెంట్‌ అధికారులను, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ప్రైవేటు విద్యా సంస్ధల కేంద్రాలకు అదనంగా అసిస్టెంట్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించారు.

(చదవండి: జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలు)

మరిన్ని వార్తలు