దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్ల ప్రదానం 

28 Mar, 2022 04:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మీడియా అకాడమి, షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి.. శిక్షణకు హాజరైన దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని రాణించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ, ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్, టీయూడబ్ల్యూజే (హెచ్‌143) ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు