జగిత్యాల రూరల్: పాడిపశువుపై ఉన్న మమకారాన్ని సరికొత్తగా చాటుకున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన వొద్దిపర్తి సంజయ్. జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన సంజయ్ పెంచుకుంటున్న ఆవు కొన్నిరోజుల క్రితం ఆడ దూడకు జన్మనిచి్చంది. ఆదివారానికి అది పుట్టి 21 రోజులు కావడంతో బంధువులు, స్నేహితులను ఆహ్వానించి లేగదూడకు బారసాల నిర్వహించారు. ఆ చిట్టి దూడకు బృందగా నామకరణం చేశారు. అనంతరం అతిథులకు విందు భోజనాలు పెట్టించారు.